మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్
హైదరాబాద్ – దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇది తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువు లాంటిదన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ముందు 122 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 1183.94 కోట్లకు పెరిగింది అంటే 9 రేట్లు పెరిగిందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముందు 40 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 4300 కోట్లకు పెరిగింది అంటే 107 రేట్లు పెరిగిందన్నారు. జూరాల ప్రాజెక్టు ముందు 70 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 1815 కోట్లకు పెరిగింది అంటే 25 రేట్లు పెరిగిందని చెప్పారు.
పులిచింతల ప్రాజెక్టు ముందు 565 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 1816 కోట్లకు పెరిగింది అంటే 3.2 రేట్లు పెరిగిందన్నారు. సింగూర్ ప్రాజెక్టు ముందు 29 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 169 కోట్లకు పెరిగింది అంటే 5.7 రేట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముందు 900 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 2048 కోట్లకు పెరిగిందన్నారు. దేవాదుల ప్రాజెక్టు ముందు 6016 కోట్లతో అంచనా వేస్తే ఇప్పటికీ 17500 కోట్ల ఖర్చు అయిందన్నారు. అంటే 2.9 రేట్లు పెరిగిందని చెప్పారు హరీశ్ రావు.
మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ 80 వేల కోట్లతో డీపీఆర్ అప్రూవ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 94 వేల కోట్లు మాత్రమే అయింది అంటే 0.5 రేట్లు మాత్రమే పెరిగిందన్నారు. ఎంత డబ్బు అడిగినా ఇస్తామన్నం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్రతో రెండు సార్లు హైదరాబాద్లో చర్చలు జరిగాయని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో ప్రయత్నించామని అన్నారు హరీశ్ రావు.
మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిన వెంటనే ఆఘమేఘాల మీద NDSA వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందు చివరి నివేదిక ఇచ్చిందన్నారు. NDSA బీజేపీ జేబు సంస్థగా మారి పోయిందని ఆరోపించారు.