గెలుపు వాకిట పంజాబ్ బోల్తా
గుజరాత్ – అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 184 పరుగులకే పరిమితమైంది. 18 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆర్సీబీ ఛాంపియన్ గా నిలవడం విశేషం. విరాట్ కోహ్లీ కంట తడి పెట్టాడు. భారీ ప్రైజ్ మనీ దక్కింది .
ఇక మ్యాచ్ విషయానికి వస్తే నువ్వా నేనా అన్న రీతిలో ఆట సాగింది ఇరు జట్ల మధ్య. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తన ప్లాన్ వర్కవుట్ అయ్యింది. ఎప్పటి లాగే విరాట్ కోహ్లీ రాణించాడు. తను అత్యధిక పరుగులు చేశాడు జట్టు తరపున. 43 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లు సైతం తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు.
ఆర్సీబీ బౌలర్లు సూపర్ షో చేశారు. కృనాల్ పాండ్యా , భువనేశ్వర్ కుమార్, షెఫర్డ్ , జోషల్ వుడ్ లు సత్తా చాటారు. పంజాబ్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. ఇక పంజాబ్ జట్టు చివరి దాకా పోరాడింది. ప్రధానంగా శశాంక్ సింగ్ 61 రన్స్ తో రెచ్చి పోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనతో పాటు జోస్ ఇంగ్లీష్ సైతం సత్తా చాటాడు. కానీ వర్కవుట్ కాలేదు.