239 పరుగుల భారీ లక్ష్యం కోల్ కతా ముందు
ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ సాధించింది. కోల్ కతా స్కిప్పర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మార్క్రామ్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతో 47 రన్స్ చేయగా మిచెల్ మార్స్ సూపర్ గా ఆడాడు. 48 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు 5 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు. కోల్ కతాకు చుక్కలు చూపించాడు. మైదానంలోకి వచ్చిన నికోలస్ పూరన్ దంచి కొట్టాడు. కోల్ కతా బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 7 ఫోర్లు 8 సిక్సర్లతో 86 రన్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 రన్స్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్.
ప్రస్తుతం టోర్నీలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. కోల్ కతా కెప్టెన్ అజింక్యా రహానే బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. పిచ్చి పట్టిన వాడిలా నికోలస్ పూరన్ శివమెత్తాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. మైదానం చుట్టూ కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. కేవలం నికోలస్ పూరన్ ఫోర్లు, సిక్సర్లతో 76 రన్స్ చేశాడు. సింగిల్స్ కేవలం 10 రన్స్ చేశాడు. అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా దాడి చేయడం ప్రారంభించింది. కడపటి వార్తలు అందేసరికి 2 ఓవర్లలో 31 రన్స్ చేసింది.