బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్
గుజరాత్ – యావత్ క్రికెట్ లోకం ఒక్కసారిగా భారత్ వైపు చూస్తోంది. దీనికి ప్రధాన కారణం గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో టాటా ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇక్కడికి చేరుకున్నాయి. రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఆర్సీబీ దుమ్ము రేపేందుకు సిద్దం అవుతోంది. మరో వైపు శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కెవ్వు కేక అనిపించేలా సై అంటోంది.
దీంతో ఇరు జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇరు జట్ల బలాలు సమానంగానే ఉన్నా టాస్ ఇక్కడ కీలకం కానుంది. కనీసం 200కు పైగా పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టుపై మరింత పట్టు పెంచుకోవచ్చని ఇరు జట్ల స్కిప్పర్లు ఆలోచిస్తున్నారు. ఇక రికీ పాంటింగ్ హెడ్ కోచ్ వ్యూహాలు పన్నుతున్నాడు. అండర్ డాగ్ గా ఉన్న పంజాబ్ ఊహించని రీతిలో ప్రత్యర్థి జట్లకు ఝలక్ ఇచ్చింది. ప్రధానంగా అయ్యర్ కెప్టెన్సీ సూపర్ గా ఉంటోంది. ఎవరిని ఎప్పుడు ఆడించాలో, ఎలా ప్రత్యర్థి ప్లేయర్లను బోల్తా కొట్టించాలో తనకు బాగా తెలుసు.
అందుకే క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించింది పంజాబ్. ప్రధానంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. తను దగ్గరుండి జట్టును గెలిపించాడు. కేవలం 41 బంతులు ఆడిన అయ్యర్ 7 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక ఆర్సీబీలో రన్ మెషీన్ కోహ్లీపైనే ఆ జట్టు నమ్మకం పెట్టుకుంది. తను ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తనను కంట్రోల్ చేయగలిగితే పంజాబ్ గెలవడం పక్కా.