చుక్కలు చూపించిన నికోలస్ పూరన్
హైదరాబాద్ – ఐపీఎల్ 2025లో బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ దెబ్బకు విల విల లాడింది. తమకు ఎదురే లేదని విర్రవీగుతూ వచ్చిన ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లారు ఆటగాళ్లు. తుక్కు రేగ్గొట్టారు. ప్రధానంగా నికోలస్ పూరన్ విధ్వంసానికి తేలి పోయారు హైదరాబాద్ బౌలర్లు. ఉతికి ఆరేశాడు. మైదానం నలుమూలలా షాట్స్ తో విరుచుకు పడ్డాడు. ఫోర్లు , సిక్సర్లతో రెచ్చి పోయాడు. దీంతో ఓటమి తప్పలేదు ఎస్ఆర్ హెచ్ కు. 5 వికెట్ల తేడాతో ఓడించింది. తమకు ఎదురే లేదని చాటింది ఎల్ ఎస్ జె. ముందు బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు.
రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల భారీ తేడాతో గెలిచిన హైదరాబాద్ కు ఝలక్ ఇచ్చింది లఖ్ నవూ. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 రన్స్ చేసింది. శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్ తో చుక్కలు చూపించాడు హైదరాబాద్ ప్లేయర్లకు. కేవలం 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. లఖ్ నవూ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అనంతరం బరిలోకి దిగిన 16.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 191 రన్స్ చేసింది. ఎస్ ఆర్ హెచ్ లో అభిషేక్ శర్మ 6 , ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 47 రన్స్ చేశాడు. నితీశ్ రెడ్డి 32, క్లాసెన్ 26 , కమిన్స్ 18 రన్స్ చేశాడు. మూడు వరుసగా సిక్సర్లు కొట్టాడు.
ఇక లఖ్ నవూ జట్టుకు చెందిన నికోలస్ పూరన్ 26 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్సర్ల మోత మోగించాడు. 70 రన్స్ చేశాడు. మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ లతో 52 పరుగులు చేశాడు.