Tuesday, June 3, 2025
HomeNEWSబీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాలి

బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాలి

బీసీల రాష్ట్ర స్థాయి స‌మావేశం

బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు బీసీ నేత‌లు. బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచిన త‌ర్వాత‌నే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్నారు. సీఎం అఖిల‌ప‌క్షంతో ఢిల్లీకి వెళ్లాల‌న్నారు. దేశవ్యాప్త కులగణన కాదు ముందు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాల‌న్నారు. బీసీలు రాజకీయ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీసీలు రాజకీయ శక్తిగా ఏర్పడి అధికారాన్ని శాసించే స్థాయికి ఎద‌గాల‌న్నారు. దేశవ్యాప్త కులగణ కోసం త్వరలోనే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామ‌న్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్.

హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కలింగ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది . ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షత వహించారు. బీసీ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి త్వరలోనే దేశ వ్యాప్తంగా సమగ్ర కులగ‌న‌ను చేపడతామని ప్రకటించడం అభినందనీయమని అన్నారు.

త్వరలోనే తమిళనాడు బీహార్, గోవా, యూపీ, రాష్ట్రాలు పర్యటించి కులగన‌ను అమలు చేసే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఆయన ప్రకటించారు . స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలను రాజకీయంగా చైతన్యం చేయడానికి జూన్ , జూలై రెండు నెలల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలు పర్యటిస్తామ‌న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments