కాళీయ మర్దనాలంకారం స్వామి వారు కటాక్షం
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాళీయ మర్దనాలంకారంలో స్వామి వారు భక్తులను కటాక్షించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహరించారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రాములవారి ఉత్సవ మూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు దర్శనం భక్తులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ , భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 14న సోమవారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.