Wednesday, April 23, 2025
HomeDEVOTIONALశ్రీ‌నివాస మంగాపురంలో కార్తీక వ‌న భోజ‌నాలు

శ్రీ‌నివాస మంగాపురంలో కార్తీక వ‌న భోజ‌నాలు

శ్రీ క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో

తిరుప‌తి – శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక వన భోజనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం, ఆనంతరం ఆస్థానం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన వన భోజనంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను భక్తులకు వడ్డించారు. శ్రీవారి వన భోజనాల కార్య‌క్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో జేఈవో వీర‌బ్ర‌హ్మం, ఆలయ‌ డెప్యూటీ ఈవో వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో గోపినాథ్‌, సూప‌రిండెంట్ ముని బాల‌కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు కిర‌ణ్ కుమార్ రెడ్డి, ధ‌న‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments