Thursday, April 24, 2025
HomeDEVOTIONALఘ‌నంగా కార్తీక స్నపన తిరుమంజనం

ఘ‌నంగా కార్తీక స్నపన తిరుమంజనం


తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్త జ‌నం

తిరుమల – పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు, ఉభయ నాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు.

అనంతరం స్వామి అమ్మ వార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వన భోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు.

స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సురేంద్ర, పేష్కర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments