మధు యాష్కి గౌడ్ కామెంట్స్
హైదరాబాద్ – కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు. ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడుతున్న నాటకమని కొట్టి పారేశారు. కవిత బీజేపీ వదిలిన బాణం అంటూ భగ్గుమన్నారు. లిక్కర్ కేసు నుంచి బయట పడేందుకు కవితకు బీజేపీ సహకారం కావాలన్నారు. బీజేపీ వ్యూహరచనలో భాగంగా కేసీఆర్కు కవిత లేఖ రాశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీ స్ట్రాంగ్ అవుతుందనేది ప్రధాని మోడీ స్ట్రాటజీ అన్నారు.
అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే లేఖ పేరుతో కవిత నాటకం ఆడుతోందంటూ ధ్వజమెత్తారు మధు యాష్కి గౌడ్.. కవితను కాంగ్రెస్లో చేర్చుకునేంత ఖర్మ తమకు పట్ట లేదన్నారు. జాగృతి పేరుతో చేపట్టిన వసూళ్లు, అవినీతిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు..అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే జాగృతిని బలోపేతం చేయాలంటోందని అన్నారు. కల్వకుంట్ల కవితకు బంజారాహిల్స్లో రూ.2 వేల కోట్ల ఆస్తులు, విల్లాలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కల్వకుంట్ల కుటుంబం నాటకం ఆడుతోందని, నాలుగున్నర కోట్ల ప్రజానీకం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని అన్నారు.