Saturday, June 21, 2025
HomeNEWSANDHRA PRADESHయోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డ్ బ్రేక్

యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డ్ బ్రేక్

సంతోషంగా ఉంద‌న్న మంత్రి అచ్చెన్న‌

విశాఖప‌ట్నం – విశాఖ కేంద్రంగా యోగాంధ్ర కార్య‌క్ర‌మం అద్బుతంగా జ‌రిగింద‌ని, ప్ర‌పంచ దేశాలు విశాఖ వైపు చూసే విధంగా చ‌రిత్ర‌లో నిలిచే పొయేలా ఈ వేడుక‌లు నిర్వ‌హించార‌మ‌ని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ వేడుక ద్వారా యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. యోగా డే కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న అద్బుత‌మ‌ని అన్నారు. ఈ మేర‌కు శ‌నివారం 11 వ అంత‌ర్జాతీయ యోగాదినోత్స‌వం వేళ విశాఖ సాగ‌ర‌తీరం సంద‌డి వాతావ‌ర‌ణం సంత‌రించుకుంది.

యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స‌హ‌చ‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి యోగాసనాలు వేశారు. యోగాంధ్ర కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ముఖ్య మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజ‌రయ్యారు. విశాఖ ఆర్‌కే బీచ్ వ‌ద్ద ఐదు లక్షల మందితో యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన‌డం సంతొషంగా ఉంద‌ని అన్నారు. సుమారు నెల రోజుల‌ను రాష్ట్ర వ్యాప్తంగా యోంగాంధ్ర వేడుకలు నిర్వ‌హించామ‌ని అన్నారు. దీంట్లో భాగంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చామ‌న్నారు.

1.40 లక్షలకు పైగా ప్రాంతాల్లో 2.17 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారని చెప్పారు మంత్రి. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు చేపట్టాం. విశాఖపట్నంలో ఒకే ప్రదేశంలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. 1.70 కోట్ల మందికి ధృవపత్రాలు జారీ చేశామ‌న్నారు. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం గ‌ర్వ కార‌ణంగా ఉంద‌న్నారు.

ప్ర‌పంచ దేశాల‌కు యోగా ప్రాముఖ్యాన్ని తెలియ‌జేసిన ఘ‌న‌త ప్ర‌ధానమంత్రి మోదీకి ద‌క్కుతుంద‌న్నారు. రాష్ట్రంలో ఇంత‌టి మంచి కార్య‌క్ర‌మం ప్రపంచ దేశాలు చూసే విధంగా నిర్వ‌హించ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. యోగా మన జీవితంలో భాగం కావాలి. ప్రజలు ప్రతిరోజూ ఒక గంట యోగా కోసం సమయం కేటాయించాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో క్రమశిక్షణ, సృజనాత్మకత వంటి అంశాలు పెంచుకోవడం చాలా అవసరమ‌న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments