విద్యా శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్
అమరావతి – మాజీ సీఎం జగన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి నారా లోకేష్. తల్లికి వందనంపై నిరాధార ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నిరూపించాలని అన్నారు. మరోసారి అసత్య ప్రచారానికి తన మీడియా ద్వారా చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆరుగురి కంటే ఎక్కువ మంది పిల్లలకు డబ్బులు జమ చేయలేదన్నారు. ఒకవేళ అలా చేసినట్లయితే నిరూపించాలన్నారు. పూర్తిగా పరిశీలించిన తర్వాతనే జాబితా ప్రకారం నిధులు రిలీజ్ చేశామన్నారు.
తన లాగే అక్రమాలకు తాము పాల్పడుతున్నామని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. సోమవారం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఇప్పటికే పలుమార్లు జగన్ కు హుందాగా వ్యవహరించాలని సూచించడం జరిగిందన్నారు. కానీ తన తీరు మార్చు కోవడం లేదన్నారు నారా లోకేష్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. తన పనితీరు దారుణంగా ఉన్నందుకే తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారన్న విషయం తెలుసుకుంటే మంచిదన్నారు.
ప్రతిపక్ష నేతగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే తెలియ చేయాలే తప్పా ఇలా అడ్డగోలుగా పత్రిక, ఛానల్ ఉందని ఆరోపణలు చేస్తూ పోతే ఎలా అని మండిపడ్డారు నారా లోకేష్. ఇప్పటికైనా సమయం ఉందని, వెంటనే దమ్ముంటే రావాలని అన్నారు.