Sunday, April 20, 2025
HomeNEWSత్వ‌ర‌లోనే స‌న్న బియ్యం పంపిణీ

త్వ‌ర‌లోనే స‌న్న బియ్యం పంపిణీ

స్ప‌ష్టం చేసిన మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్ – అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా స‌రే పేదలను ఆదుకుంటామని తెలిపారు. కోట్లాది రూపాయల ఖర్చుతో నాలుగు పథకాలు ప్రారంభించామ‌న్నారు. పంటకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు.

భూమి లేని పేదల పరిస్థితి చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండ‌గా ఇండ్లు లేని నిరుపేద‌ల‌కు తొలి విడత‌లో నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. తాము ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసి తీరుతామ‌న్నారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. చాలా చోట్ల ద‌ర‌ఖాస్తులు చేసుకోలేద‌ని, కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిని కూడా ల‌బ్ది క‌లిగించేందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments