మంత్రి వాసంశెట్టి సుభాష్
వెనుకబడిన తరగతుల నుండి కొన్ని కులాల తొలగింపు అంశంపై జరిగిన బహిరంగ విచారణలో పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ .తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించబడిన బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణలో వెనుకబడిన తరగతుల జాబితాలోని కొన్ని కులాలను తొలగించాలనే అంశంపై చర్చించారు. వెనుకబడిన తరగతుల హక్కులను పరిరక్షించటం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నామని అన్నారు.
అన్యాయం జరగకుండా, సమగ్ర సమాచార ఆధారంగా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇకపోతే, సామాజిక సమత్వం, హక్కుల పరిరక్షణ, సంక్షేమ విధానాల అమలులో సమతుల్యత పాటించడంలో ఈ కమిషన్ నిర్వహించిన విచారణలు కీలకమైన వేదికలుగా ఉపయోగ పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఆంధ్రాకు చెందిన కొన్ని కులాలను ఇక్కడ చేర్చడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరాక రాష్ట్రంలో రేవంత్ కు బదులు చంద్రబాబు నాయుడే పాలన సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా ఆంధ్రాకు చెందిన వారిని ఇక్కడ నియమించడం, పలు ప్రాధాన్యత పోస్టులను కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది.