Friday, June 13, 2025
HomeDEVOTIONALమోహినీ అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

మోహినీ అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

ఘ‌నంగా స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి – తిరుప‌తి లోని ప్ర‌సిద్ది చెందిన పుణ్య క్షేత్రంగా కొలుస్తున్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా బుధవారం ఉదయం 8 గం.లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు పల్లకీలో మోహినీ అవతారోత్సవంలో భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం చేప‌ట్టారు. సాయంత్రం 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ కొన‌సాగింది.

రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments