Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHఅనాథ పిల్ల‌ల‌కు ఆస‌రా సీఎం భ‌రోసా

అనాథ పిల్ల‌ల‌కు ఆస‌రా సీఎం భ‌రోసా

పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని ఆదేశం
అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల‌కు పెన్ష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.

3 నెల‌ల్లో అనాథ పిల్ల‌ల‌ను గుర్తించి సాయం అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు . ఈ మేర‌కు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు వెంట‌నే వివ‌రాలు సీఎస్ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ కు అంద‌జేయాల‌ని ఆదేశించారు చంద్ర‌బాబు నాయుడు.

ఏ ఒక్క‌రు కూడా రాష్ట్రంలో అనాథ‌లు ఉండ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున అన్ని స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని , ఆ భ‌రోసా క‌ల్పించాల‌ని పేర్కొన్నారు సీఎం. త‌ల్లిదండ్రులు లేర‌న్న భావ‌న‌నే రానీయకుండా చూసుకుంటామ‌ని, స్ప‌ష్ట‌మైన హామీని తాను ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

వారిని ఉన్న‌త‌మైన పౌరులుగా తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, భ‌యప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. స‌ర్కార్ అండ‌గా ఉంటుంద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments