Saturday, May 24, 2025
Homeముత్య‌పు పందిరి వాహ‌నంపై రామ‌చంద్రుడు

ముత్య‌పు పందిరి వాహ‌నంపై రామ‌చంద్రుడు

భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చిన దేవ దేవుడు

తిరుపతి – తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి 7 గంట‌ల‌కు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామ స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.

మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపు పందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలి వస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామి వారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో ర‌వి, సూపరింటెండెంట్‌ మునిశంక‌ర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments