Wednesday, June 11, 2025
HomeDEVOTIONALవేణు గోపాల స్వామి అలంకారంలో వేంక‌టేశ్వ‌రుడు

వేణు గోపాల స్వామి అలంకారంలో వేంక‌టేశ్వ‌రుడు

ముత్య‌పు పందిరి వాహ‌నంపై ఊరేగిన శ్రీ‌వారు

తిరుప‌తి – తిరుప‌తి లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో కొన‌సాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీ‌వారు శ్రీ‌ వేణుగోపాల స్వామి అలంకారంలో ద‌ర్శ‌నం ఇచ్చారు భ‌క్తుల‌కు. అనంత‌రం సింహ వాహనంపై ఊరేగారు. స్వామి వారి కృప కోసం భ‌క్తులు బారులు తీరి ద‌ర్శించుకున్నారు.

రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి వారి కృప‌కు పాత్రుల‌య్యారు. సాయంత్రం 5 గం.లకు ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. అనంతరం సా. 5.30 – 6.30 గం.ల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఇవాళ‌ ఉదయం 8 గం.లకు కల్పవృక్ష వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించారు.

వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు , భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా స్వామి వారి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments