మంత్రి నారా లోకేష్ కీలక కామెంట్స్
మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రజా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల భర్తీపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. గత సర్కార్ కొలువుల భర్తీ విషయంలో సరిగా స్పందించ లేదన్నారు. కానీ తాము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేశామన్నారు. డైనమిక్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి సర్కార్ అన్ని రంగాలలో ముందుకు వెళుతోందన్నారు. ప్రదానంగా ఇచ్చిన మాట ప్రకారం ఏపీ మెగా డీఎస్సీకి ప్రకటన రిలీజ్ చేశామన్నారు.
జూన్ నెలలో రెండు విడతలుగా డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామన్నారు నారా లోకేష్. జాబ్స్ జాతర మొదలైందన్నారు. గత ప్రభుత్వం ఖాళీగా వదిలేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే తాము చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తి చేశామని, మెయిన్స్ పరీక్ష నిర్వహించ బోతున్నామని తెలిపారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థలు ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా రాయాలని సూచించారు నారా లోకేష్.