Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHమ‌హిళా సంక్షేమానికి కూట‌మి స‌ర్కార్ పెద్ద‌పీట

మ‌హిళా సంక్షేమానికి కూట‌మి స‌ర్కార్ పెద్ద‌పీట

మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టిన మహిళలు

అమరావతి : మహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్ప‌ష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుక ఘనంగా నిర్వహించారు.

నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కు హారతి ఇచ్చి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా అక్కా చెల్లెమ్మలకు మంత్రి నారా లోకేష్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలిచామన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళల స్వయం ఉపాధికి కృషి చేశామన్నారు. అంతకు ముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, టీడీపీ డ్వాక్రా-అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతతో పాటు పలువురు మహిళలు మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments