12 ప్రదేశాలలో విస్తృత తనిఖీలు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్ఐఏ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది. సీనియర్ టీం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 ప్రదేశాలలో సోదాలు చేపట్టింది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద చొరబాటు కేసుకు సంబంధించి బుధవారం జమ్మూ అంతటా అనేక ప్రదేశాలలో సోదాలు చేపట్టడం జరిగిందని ఎన్ఏఐ చీఫ్ వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది దర్యాప్తు సంస్థ.
అధికారుల ప్రకారం నిషేధిత సంస్థలైన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) , జైషే-ఏ-మొహమ్మద్ (JeM) లకు చెందిన క్రియాశీల ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దు (IB), నియంత్రణ రేఖ (LoC) ద్వారా భారతదేశంలోకి చొరబడ్డారనే సమాచారం అందింది. భారత నిఘా సంస్థ ఎన్ఐఏను, హోం శాఖ ను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా గత సంవత్సరం కేసు నమోదు చేయబడింది.
ఈ చొరబాట్లకు జమ్మూ ప్రాంతంలోని గ్రామాలలో ఉన్న భూగర్భ కార్మికులు (OGWలు), ఇతర ఉగ్రవాద సహచరులు దోహదపడ్డారు. ఉగ్రవాదులకు లాజిస్టికల్ మద్దతు, ఆహారం, ఆశ్రయం, డబ్బును అందించడంలో నిమగ్నమై ఉన్నారు.