Monday, April 21, 2025
HomeNEWSతెలంగాణ స‌ర్కార్ కు హ‌క్కుల క‌మిష‌న్ నోటీస్

తెలంగాణ స‌ర్కార్ కు హ‌క్కుల క‌మిష‌న్ నోటీస్

సంధ్య థియేట‌ర్ కేసుకు సంబంధించి

హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌భుత్వానికి బిగ్ షాక్ త‌గిలింది. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్ ఆర్ సీ ) నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న కేసుకు సంబంధించి లాఠీఛార్జి చేసిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. లాయ‌ర్ రామారావు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాల‌ని డీజీపీ జితేంద‌ర్ కు స్ప‌ష్టం చేసింది క‌మిష‌న్.

ఇదిలా ఉండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో సుకుమార్ దర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా, శ్రీ‌లీల క‌లిసి న‌టించిన పుష్ప‌-2 మూవీ ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద ఉన్న సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌లో రేవతి అనే మ‌హిళ చ‌ని పోయింది. త‌న కొడుకు శ్రీ‌తేజ్ తీవ్రంగా ప‌డి కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై కేసు న‌మోదు చేశారు చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు. ఇదే కేసులో న‌టుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments