Tuesday, April 15, 2025
HomeNEWSఒలెక్ట్రా కంపెనీకి 297 బస్సుల ఆర్డర్

ఒలెక్ట్రా కంపెనీకి 297 బస్సుల ఆర్డర్

ఇదే అతిపెద్ద అవుట్‌రైట్ ఆర్డర్

హైదరాబాద్ – భారతదేశంలో ఎలక్ట్రిక్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుండి తొమ్మిది మీటర్ల పొడవైన 297 నాన్-ఎయిర్ కండిషన్డ్ (నాన్-ఎసి) బస్సుల ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ పొందింది. ఒలెక్ట్రా అధికారికంగా హె చ్ ఆర్ టీ సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మురారి లాల్ నుండి లెటర్ ఆఫ్ అవార్డ్ (LOA)ని అందుకుంది. ఈ ఆర్డర్ ద్వారా సంస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఒక రోడ్ రవాణా సంస్థ ఇన్ని ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా కొనుగోలు చేయటం దేశంలో ఇదే ప్రథమం.

హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలలో నడిపేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు 30 మంది ప్రయాణీకుల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సుల మొత్తం ఆర్డర్ విలువ రూ 424 కోట్లు, ఇది ఔట్‌రైట్ కొనుగోలు మోడల్ కింద అతిపెద్ద సింగిల్-స్టేట్ ఎలక్ట్రిక్ బస్సు సేకరణలలో ఒకటిగా నిలిచింది. ఈ విస్తరణ దేశంలో స్వచ్ఛమైన, స్థిరమైన ప్రజా రవాణాను ప్రోత్సహించడంలో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments