జూన్ 20, 21 తేదీలలో భక్తులు సమర్పించిన మొబైల్స్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న 74 లాట్ల మొబైల్ ఫోన్లను జూన్ 20 నుండి 21వ తేదీ వరకు టిటిడిలో ఆన్ లైన్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు.
కార్భన్ , ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్, మొబైల్ ఫోన్లు ఈఏఐడి నెం. 25132, 25133, 25134, 25135 ఆన్ లైన్ లో ఈ – వేలం వేయనున్నారు.
ఆసక్తి కల్గిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వేలంలో పాల్గొనటానికి అర్హులని తెలిపింది టీటీడీ. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలంలు), / ఏఈవో ( వేలంలు), టిటిడి, హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu. ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించాలని సూచించింది.