Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESH23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స‌భ‌లు చేప‌ట్టాలి

23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స‌భ‌లు చేప‌ట్టాలి

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీలక ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం స‌చివాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. పంచాయ‌తీరాజ్ శాఖపై స‌మీక్ష చేప‌ట్టారు . ఇదిలా ఉండ‌గా ఉపాధి హామీ ప‌థ‌కంలో చేప‌ట్టాల్సిన ప‌నుల ఆమోదం కోసం గ్రామ స‌భ నిర్వ‌హ‌ణ , ఇందుకు సంబంధించిన విధి విధానాల‌పై దిశా నిర్దేశం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని స్ప‌ష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టాల‌ని సూచించారు డిప్యూటీ సీఎం.

ఈ పథకం ద్వారా రూ. వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామ‌ని చెప్పారు. ప్రతి రూపాయినీ బాధ్యతతో ఖ‌ర్చు చేప‌ట్టాల‌న్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలన్నారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పి.ఆర్ , ఆర్.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments