ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మహారాష్ట్ర – మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి అని , మరాఠా పరాక్రమానికి చిహ్నంగా , సనాతన ధర్మ రక్షకునిగా నిలుస్తుందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శివాజీ మహారాజ్ ధైర్యం, నాయకత్వ వారసత్వంతో తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఈ పుణ్యభూమిని సందర్శించడం గర్వ కారణంగా ఉందన్నారు.
పిఠాపురం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులతో, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందుతూ, తన వీర స్ఫూర్తిని నిలబెట్టే మహారాష్ట్ర శ్రేయస్సు, పురోగతి కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు.
దిగ్గజ నాయకుడు బాలాసాహెబ్ థాకరే ను కూడా తాను గుర్తు పెట్టుకుంటానని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం. అతని నిర్భయ నాయకత్వం ప్రతి భారతీయుడికి స్పూర్తిగా నిలిచిందన్నారు.
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మహారాష్ట్ర నుంచి పిఠాపురంలోని శ్రీ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులు రైల్ స్టాప్ లేక పోవడంతో పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నానని తెలిపారు.
ఈ విషయాన్ని రైల్వే శాఖతో చర్చిస్తానని, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పిఠాపురంలో రైళ్లు ఆగేలా చూస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు పవన్ కళ్యాణ్. లాతూర్ సందర్శన సమయంలో, తిరుమలలో లార్డ్ బాలాజీని దర్శించుకునే భక్తుల కోసం లాతూర్ నుండి తిరుపతికి నేరుగా రైలు , విమాన సేవల కోసం తనకు అభ్యర్థనలు వచ్చాయని అన్నారు.