స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తమిళనాడు – ప్రపంచంలో తొలి విప్లవ నాయకుడు మురుగన్ అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మురుగన్ కు భేదభావం లేదని అందరూ సమానమేనని అన్నారు. మధురై నగరానికి ఎన్నో ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందన్నారు. మార్పు కావాలంటే ధైర్యం ఉండాలన్నారు. కష్టాన్ని ఆపేస్తే, కాలం నడక ఆపదన్నారు. కొందరి కుత్సిత ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదని స్పష్టం చేశారు. ఈ తరం కచ్చితంగా మధురై చరిత్ర ఏమిటో తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
అచమిల్లై అచమిల్లై అచమ్ ఎన్బతు ఇల్లయే అనే మహాకవి భారతీయర్ మాటలు ధైర్యాన్ని ఇస్తాయన్నారు. మధురైలో పార్వతి దేవి స్వరూపం మీనాక్షీ అమ్మ వారు. శివుడు సుందరేశ్వరిని రూపంలో కొలువయ్యారు. వారి కుమారుడు కార్తికేయుడు ఇక్కడే కొలువై ఉన్నారు. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో తొలిది, ఆరవది ఈ ప్రాంతంలోనే ఉందన్నారు పవన్ కళ్యాణ్.
మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం. మనం మీనాక్షి అమ్మ వారి ఆలయానికి వెళ్తున్నాం. అక్కడ ఆశీర్వాదం పొందుతున్నాం. కుంకుమ తీసుకుంటున్నాం. ప్రసాదం తీసుకుంటున్నాం. కానీ… ఈ తరం తెలుసుకోలేని నిజం ఒకటి ఉంది. ఒక సమయంలో మధురై ధ్వంసమైంది. ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు. కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో ఇచ్చేవారూ లేరు. పూజలు జరగలేదు. ఆలయాన్ని మూసివేశారు. ఎందుకు తెలుసా అని ప్రశ్నించారు.
14వ శతాబ్ద ప్రారంభంలో మధురైను మాలిక్ కఫూర్ దోచుకున్నాడు. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసి వేయబడిందన్నారు. అలాంటి మధురై చీకటి కాలంలో 14వ శతాబ్దం చివరలో మళ్లీ వెలుతురు పుట్టిందని చెప్పారు. ఆ వెలుతురును వెలిగించిన వాడు విజయనగర యువరాజు కుమార కంబణన్. మనం అర్థం చేసుకోవాల్సింది..మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించ లేరన్నారు. మన సంప్రదాయం బలమైనది. ధర్మం లోతుగా ఉంది. లోతుగా ఉండ బోతోందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదెల.