Wednesday, June 25, 2025
HomeNEWSANDHRA PRADESHకుమారుడికి గాయం ప‌వ‌న్ ప్ర‌యాణం

కుమారుడికి గాయం ప‌వ‌న్ ప్ర‌యాణం

సింగ‌పూర్ లో మార్క్ శంక‌ర్ కు గాయం
అమ‌రావ‌తి – డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మ‌న్యం టూర్ ను ర‌ద్దు చేసుకున్నారు . హుటా హుటిన సింగ‌పూర్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. అక్క‌డ త‌న చిన్న‌కుమారుడు మార్క్ శంక‌ర్ చ‌దువుకుంటున్నాడు. స్కూల్ లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో కొడుకు చేతులు, కాళ్ల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాన’ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ గారు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments