Monday, April 21, 2025
HomeSPORTSగుకేష్ దొమ్మ‌రాజుకు మోడీ కంగ్రాట్స్

గుకేష్ దొమ్మ‌రాజుకు మోడీ కంగ్రాట్స్

అభినందించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు
హైద‌రాబాద్ – భార‌త దేశానికి చెందిన గ్రాండ్ మాస్ట‌ర్ గుకేష్ దొమ్మ రాజు చ‌రిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వ‌యస్సు లో ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్ గా నిలిచాడు. ఈ సంద‌ర్బంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచాడ‌ని పేర్కొన్నారు.

రికార్డు త‌న పేరు మీద లిఖించాడు. డ్రాగా ముగుస్తుంద‌ని ఊహించిన ఉత్కంఠ భ‌రిత ఎండ్ గేమ్ లో గుకేష్ దొమ్మ‌రాజు చైనా గ్రాండ్ మాస్ట‌ర్ డింగ్ లిరెన్ తో పోటీ ప‌డ్డాడు.

ఇదిలా ఉండ‌గా సింగపూర్‌లో జరిగిన 14 గేమ్‌ల చివరి గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి భారతదేశానికి చెందిన టీనేజర్ గుకేష్ దొమ్మరాజు అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

18 ఏళ్ల గుకేష్ దొమ్మ‌రాజు గ్యారీ కాస్పరోవ్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు, అతను 1985లో అనటోలీ కార్పోవ్‌ను ఓడించినప్పటి నుండి అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ దొమ్మ రాజు డింగ్‌ను ఓడించి 6-5 ఆధిక్యంలో నిలిచాడు. ఈ సంద‌ర్బంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అభినంద‌న‌లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments