Monday, April 21, 2025
HomeNEWSNATIONALదేశం గొప్ప నాయ‌కుడిని కోల్పోయింది

దేశం గొప్ప నాయ‌కుడిని కోల్పోయింది

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దాస్ మోడీ

హైద‌రాబాద్ – భార‌త దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్ను మూయ‌డం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఆయ‌న మృతి దేశానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు. దేశం గ‌ర్వించ ద‌గిన నేత‌ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. త‌న‌కు అత్యంత ఆత్మీయుడైన స్నేహితుడ‌ని గుర్తు చేసుకున్నారు.

డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని, ఎక్కువ‌గా మాట్లాడ‌క పోవ‌డం, ఆచ‌ర‌ణాత్మ‌కంగా ఉండ‌డం గొప్ప‌నైన విష‌యాల‌ని పేర్కొన్నారు పీఎం. భారతదేశం తన విశిష్ట నాయకులలో ఒకరైన మన్మోహన్ సింగ్ జీని కోల్పోయింది.

నిరాడంబరమైన మూలాల నుండి ఎదిగి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక మంత్రిగా సహా పలు ప్రభుత్వ పదవుల్లో కూడా పనిచేసి, బలమైన ముద్ర వేశారు. అనేక సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై ఆయన ప్ర‌భావం ఎల్ల‌ప్ప‌టికీ ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాలు మెరుగు ప‌ర్చేందుకు త‌ను ప్ర‌ధానిగా శాయ‌శ‌క్తులా కృషి చేశార‌ని కొనియాడారు.

మ‌న్మోహ‌న్ సింగ్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments