Thursday, April 24, 2025
HomeNEWSNATIONALభార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంటుంది

భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంటుంది

పాకిస్తాన్ ను హెచ్చ‌రించిన ప్ర‌ధాని

బీహార్ – ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీహార్ లో జ‌రిగిన స‌భ‌లో పాకిస్తాన్ ను ఉద్దేశించి మండిప‌డ్డారు. ప‌హ‌ల్గామ్ దాడిలో పాల్గొన్న ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్ట‌మ‌న్నారు. దాడి చేసిన ప్ర‌తి ఒక్క‌రినీ వెతికి ప‌ట్టుకుని తీరుతామ‌న్నారు. ఇది టూరిస్టుల‌పై జ‌రిగిన దాడి కాద‌ని, దేశంపై జ‌రిగిన దాడిగా అభివ‌ర్ణించారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం కోసం ఉపయోగిస్తున్న భూభాగాన్ని నాశనం చేస్తామ‌ని అన్నారు. టెర్రరిస్టులు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామ‌న్నారు.

భార‌త దేశం ప్ర‌తి ఉగ్ర‌వాదిని గుర్తిస్తుంది..ట్రాక్ చేస్తుంది..శిక్షిస్తుంది. ఇంకొక‌రు ఇండియా వైపు చూడాలంటే జంకేలా చేస్తామ‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. టెర్ర‌రిస్టుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చే వాళ్ల‌కు ఇదే నా హెచ్చ‌రిక అని ప్ర‌క‌టించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరీ దారుణంగా మరణించిన రెండు రోజుల తర్వాత బలమైన సందేశం పంపారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళి అర్పించారు. దేశం మొత్తం దుఃఖంలో ఉన్న కుటుంబాలతో ఉంది.

గాయపడిన వారి శ్రేయస్సును నిర్ధారించడానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఎవరో ఒక కొడుకును కోల్పోయారు, ఎవరో ఒక సోదరుడిని కోల్పోయారు, ఎవరో ఒక జీవిత భాగస్వామిని కోల్పోయారు. ఎవరో బెంగాలీ మాట్లాడేవారు, ఎవరో కన్నడ మాట్లాడేవారు, ఎవరో మరాఠీ, ఎవరో ఒడియా, ఎవరో గుజరాతీ, ఎవరో బీహార్ కుమారుడు ఉన్నార‌న్నారు. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు, దుఃఖం, కోపం ఉన్నాయి. ఈ దాడి అమాయక పర్యాటకులపై మాత్రమే కాదు; దేశ శత్రువులు భారతదేశ ఆత్మపై దాడి చేయడానికి ధైర్యం చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments