తీవ్ర ఆవేదన చెందిన ప్రధాని మోదీ
గుజరాత్ – ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన తనను కలిచి వేసిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన హుటా హుటిన ప్రమాద స్థలాన్ని సందర్శించారు. నేరుగా ఎయిర్ పోర్టు నుంచి మేఘా నగర్ కు చేరుకున్నారు. ఆయన వెంట సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు వివరించారు కేంద్ర మంత్రి. ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు పీఎం.
ఇదిలా ఉండగా ప్రయాణీకులతో పాటు సిబ్బంది, మెడికల్ క్వార్టర్స్ లో ఉన్న 24 మంది అక్కడికక్కడే చని పోయారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్ ఇండియా ఫ్లైట్ చెట్టును తాకింది. అక్కడి నుంచి నగరంలోని మేఘా నగర్ లో కూలి పోయింది. బీజే భవనాలను ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మొత్తం జర్నీలో ఉన్న వారిలో ఒకే ఒక్కడు మాత్రం బతికి బయటపడ్డాడు. విమానం ఎమర్జెన్సీ కిటికీ నుంచి దూకాడు. ప్రాణాలు పోకుండా కాపాడుకున్నాడు. ప్రస్తుతం తను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రధానమంత్రి ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన మనసు బాగోలేదన్నారు. బాధితుడిని పరామర్శించారు. తనకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఇదే క్రమంలో బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించారు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.