Monday, April 21, 2025
HomeDEVOTIONALనేడే ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌రుడి ర‌థోత్స‌వం

నేడే ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌రుడి ర‌థోత్స‌వం

భారీగా త‌ర‌లి రానున్న భ‌క్త జ‌న బాంధ‌వులు

తిరుప‌తి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిదారుడి అలంకారంలో స్వామి వారు కటాక్షించారు.

ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా జూన్ 24న సోమ‌వారం రథోత్సవం వైభవంగా జరుగనుంది.

ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 9.25 నుండి 11 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

కాగా ఆదివారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.వాహన సేవలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కంకణ భట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments