అంగరంగ వైభవోపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి – తిరుపతిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం 09.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. 7 నుంచి 8.30 గం.ల మధ్య పుణ్యా హవచనం, నవగ్రహ పూజ చేపట్టారు. తదుపరి 8.41 – 8.55 గం.ల మధ్య రథారోహణం, 8.55- 8.58 గం.ల మధ్య రథాగమనం నిర్వహించారు. 09.00 – 10.30 గం.లకు భక్త జనసమోహం మధ్య రథోత్సవం చేపట్టారు. సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రి 07.00 – 08.00 గం.ల మధ్య అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించారు.
జూన్ 15 ఆదివారం ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం జరుగనుంది. తదుపరి 9.15 – 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.30 – 10.45 గం.ల వరకు తీర్థవారి చక్ర స్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00- 5.00 గం.ల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 07.00 – 07.30 గం.ల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.