సంచలన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గాను కొత్తగా 571 స్కూల్స్ ను ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. తాము వచ్చాక సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విద్యా శాఖపై సీఎం సమీక్ష చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ స్కూల్ ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మారుస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. ఇంకా ఖాళీగా ఉన్న వాటిని నింపేందుకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. నిరుద్యోగులు, అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా జాబ్స్ కోసం ఫోకస్ పెట్టాలన్నారు సీఎం. విద్యా పరంగా ఇప్పటికే వీసీలను భర్తీ చేయడం జరిగిందన్నారు. పూర్తి పారదర్శకతతో టీచర్ల బదిలీలు చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.
త్వరలోనే మరోసారి డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ బడులు, కాలేజీలు ఉండేలా తీర్చి దిద్దాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యా రంగం అభివృద్ది కోసం ఎన్ని కోట్లు అయినా మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే ఐఐఐటి కాలేజీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంజూరైందన్నారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్స్ తీసుకుంటున్నట్లు తెలిపారు సీఎం.