Monday, April 7, 2025
HomeDEVOTIONALటీటీడీకి రూ.కోటి విరాళం

టీటీడీకి రూ.కోటి విరాళం

శివ‌మ్ కాండేవ్ ప్రైవేట్ కంపెనీ

తిరుమ‌ల – తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. సోమ‌వారం స్వామి వారికి ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.

అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి వై.రాఘవేంద్ర విశ్వకర్మ విరాళాల‌కు సంబంధించిన డీడీలను అందజేశారు. ఈసంద‌ర్బంగా విరాళాలు అంద‌జేసిన శ్రీ‌వారి భ‌క్తుల‌కు ప్ర‌త్యేకంగా అభినందించారు టీటీడీ ఏఈవో.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments