పోస్టర్ ను ఆవిష్కరించిన ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోస్టర్ ను టిటిడి ఈవో జె. శ్యామల రావు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి.
జూన్ 01వ తేదీ సాయంత్రం 5.30 గం.ల నుండి 8.00 గం.ల వరకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 02వ తేదీ ఉదయం 07.02 నుండి 07.20 గం.ల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణము జరుగనుంది. రాత్రి 07 గం.లకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
03.06. 2025 – ఉ. – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం
04.06. 2025 – ఉ. – ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం
05.06. 2025 – ఉ. – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం
06.06. 2025 – ఉ. – మోహినీ అవతారం, రాత్రి – గరుడ వాహనం
07.06. 2025 – ఉ. – హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనం
08.06. 2025 – ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
09.06. 2025 – ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
10.06. 2025 – ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, జీవో ముని కృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.