మాజీ మంత్రికి ఝలక్ ఇచ్చిన కోర్టు
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, గిరిజనులను బెదిరించిన కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. అరెస్ట్ చేస్తారనే భయంతో 7 వారాలకు పైగా పరారీలో ఉన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక టాప్ వైసీపీ నేతలను వెంటాడుతోంది. కేసులు నమోదు చేసింది.
ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు కాకాణి గోవర్దన్ రెడ్డి. తన క్లయింట్ కు ఎలాంటి నేరచరిత్ర లేదని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశారు గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాది.కాకాణి నేరచరిత్రను ఆధారాలతో సహా కోర్టుకు నివేదించిన ప్రభుత్వ న్యాయవాది. ఎన్నికల సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ చూసి ఆయన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తులు. బెయిల్ పిటీషన్ ను వాపస్ తీసుకుంటామని అభ్యర్థించిన కాకాణి న్యాయవాది.
కేసు తీవ్రత, 7 వారాలుగా పరారీలో ఉండటం తదితర కారణాల నేపథ్యంలో కాకాణి న్యాయవాది వినతిని తిరస్కరించి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసింద సుప్రీం కోర్టు.