కేబినెట్ లో రిటైర్డ్ ఉద్యోగులకు డీఏలు వర్తింపు
హైదరాబాద్ – తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించింది మంత్రివర్గం.
రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం అమలుకు రూ. 38.5 కోట్లు స్త్రీ నిధికి కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.మొత్తం 13,137 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ చెప్పింది. ఇందులో బాగంగా ఫేజ్ 2B ప్రాజెక్టులో 86.1 కిలోమీటర్లకు రూ.19579 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల జాయింట్ వెంచర్ తో చేపట్టాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే నిర్ణయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలియ చేస్తున్నాయి.
రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మందికి పైగా పదవీ విరమణ చేయనున్నారు. వీరికి డబ్బులు చెల్లించాలంటే కనీసం రూ. 9000 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖజానాలో చిల్లి గవ్వ లేదు.