Monday, June 16, 2025
HomeNEWSవిద్యా ప్ర‌మాణాల పెంపు కోసం ఎన్జీఓల స‌హ‌కారం

విద్యా ప్ర‌మాణాల పెంపు కోసం ఎన్జీఓల స‌హ‌కారం

తెలంగాణ ప్ర‌భుత్వంతో కీల‌క ఒప్పందం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ బ‌డుల‌లో విద్యా ప్ర‌మాణాలు పెంచేందు కోసం దేశంలో పేరు పొందిన ఆరు విద్యా ప‌రంగా కృషి చేస్తున్న స్వ‌చ్చంధ సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో విద్యా శాఖ‌తో ఎంఓయూ చేసుకున్నాయి. ఇందులో ఎక్ స్టెప్ ఫౌండేష‌న్, ఫిజిక్స్ వాలా, ఖానా అకాడ‌మీ, ప్ర‌జ్వ‌లా ఫౌండేష‌న్, జై జామ్ ఫౌండేష‌న్ లు ఉన్నాయి. పోటీ ప‌రీక్ష‌ల‌తో పాటు ఇత‌ర ప్ర‌ధాన అంశాల‌పై సాంకేతిక ప‌రిజ్ఞానం అందిస్తాయి. పోటీ పరీక్ష‌ల‌కు స‌న్న‌ద్దం చేస్తాయి.

ఇదిలా ఉండ‌గా నందన్ నీలేకని నిర్వహిస్తున్న ఎక్‌స్టెప్ ఫౌండేషన్ ఇప్పటికే 540 పాఠశాలల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత వేదికతో పనిచేస్తోంది. ఇప్పుడు, ఈ సంస్థ 33 జిల్లాల్లోని 5,000 కి పైగా ప్రాథమిక పాఠశాలల్లో సేవలను అందిస్తుంది. ఈ సంస్థ 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు తెలుగు, ఆంగ్ల భాషలతో పాటు గణితం ప్రాథమిక అంశాలను అందిస్తుంది.

ఫిజిక్స్ వాలా ఇంటర్ విద్యార్థులకు NEET, JEE, CLAT పరీక్షలకు కోచింగ్ అందిస్తుంది. ఇది పాఠశాల స్థాయి నుండి పోటీ పరీక్షలకు విద్యార్థులకు ఉచిత శిక్షణను కూడా అందిస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందిస్తుంది.

డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల కోసం పిల్లల భద్రత‌, రక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. పై జామ్ ఫౌండేషన్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్‌లో శిక్షణను అందిస్తుంది. బాలికలకు అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగు పరచడానికి విద్యావంతులైన బాలికలు 16,000 మందికి పైగా బడి బయట ఉన్న పిల్లల నమోదును చేపడతారు.

ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి హరిత, ఎక్స్‌స్టెప్ ఫౌండేషన్ సీఈఓ జగదీష్ బాబు, ప్రజ్వల ఫౌండేషన్ చీఫ్ డాక్టర్ సునీత కృష్ణన్, ఫిజిక్స్ వాలా సహ వ్యవస్థాపకురాలు ప్రతీక్ మహేశ్వరి, ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ స్వాతి వాసుదేవన్, పై జామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు షోయబ్ దార్, ఎడ్యుకేట్ గర్ల్స్ సీఈఓ గాయత్రి నాయర్ లోబో తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments