నేటి నుంచి ప్రారంభించేందుకు సిద్దం
హైదరాబాద్ – నేటి నుంచి 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు విధించింది ఎన్నికల సంఘం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు విధించింది. ప్రత్యేక అసెంబ్లీ సందర్భంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు.
ఇదిలా ఉండగా ఈనెల 27న పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మార్చి 2న ఓట్లను లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
రాష్ట్రంలో రెండు టీచర్ , ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ , మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి , నిజామాబాద్ – కరీంనగర్ – ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి ఎలక్షన్ జరగనుంది.
ప్రస్తుతం జరగబోయే టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో తక్షణమే ఎన్నికల కోడ్ రానుందని ప్రకటించింది ఎన్నికల సంఘం. కాగా మెదక్ – ఆదిలాబాద్ – కరీంనగర్ – నిజామాబాద్ గ్రాడ్యూయేట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఇక ఇదే నిజయోకవర్గాల టీచర్ ఎమ్మెల్సీ గా కూర రఘోత్తం రెడ్డి, , వరంగల్ – నల్గొండ – ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా నర్సిరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలంలో వచ్చే మార్చి 29తో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది.