శాస్త్రోక్తంగా శ్రీ కోదండ రామస్వామి
తిరుపతి – తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పుష్ప యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు పుణ్యాహ వచనం, మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామి వారికి అభిషేకం చేస్తారు. రాత్రి 7 గంటలకు నాలుగు మాడ వీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్లు భక్తులకు అభయమిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపో తాయని విశ్వాసం.ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో బి.రవి, సూపరింటెండెంట్ ఎం.మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఎ.ఎం.సురేష్ బాబు, గుణశేఖర్ , ఆలయ అర్చకులు పాల్గొన్నారు.