ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా ఆర్సీబీ
గుజరాత్ – ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ కావడం పట్ల కీలక వ్యాఖ్యలు చేశాడు ఆ జట్టు స్కిప్పర్ రజత్ పాటిదార్. జట్టు యాజమాన్యం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అన్నాడు. ఈ విజయం సులువుగా రాలేదన్నాడు. చివరి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో పంజాబ్ తో మ్యాచ్ సాగిందని చెప్పాడు. కానీ అంతిమంగా గెలుపు తమదేనని తనకు ముందే తెలుసన్నాడు. ప్రధానంగా బ్యాటర్లతో పాటు తమ టీమ్ బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారని, ప్రత్యర్థి ప్లేయర్లకు చుక్కలు చూపించారని పేర్కొన్నారు. మొత్తంగా ఇది సమిష్టి విజయమని స్పష్టం చేశాడు .
ఇదిలా ఉండగా మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ టాస్ గెలిచాడు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 190 రన్స్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ 43 పరుగులతో రాణించగా పాటిదార్ 26 కీలక పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు పర్వాలేదని అనిపించారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 184 పరుగులకే పరిమితమైంది. ప్రభ్ సిమ్రన్ సింగ్ ప్రియాన్ష్ ఆర్య ధాటిగా ఆడేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు.
తొలి వికెట్ భాగస్వామ్యానికి 43 రన్స్ చేశారు. ప్రధానంగా కృనాల్ పాండ్యా వీరి జోడికి బ్రేక్ వేశాడు. తను 4 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. తనతో పాటు భువనేశ్వర్ కుమార్, జోషల్ వుడ్ , రొమారియా సెఫర్డ్ సత్తా చాటారు.