Sunday, April 20, 2025
HomeDEVOTIONALశ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.73 కోట్లు

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.73 కోట్లు

ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య 57 వేల 655

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వులతో కిట కిట లాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.

శ్రీ‌వారిని జ‌న‌వ‌రి 24న శుక్ర‌వారం 57 వేల 655 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 20 వేల 51 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2,73 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు.

ప్ర‌స్తుతం స్వామి, అమ్మ వార్ల ద‌ర్శ‌నం కోసం 9 కంపార్టుమెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు స‌ర్వ ద‌ర్శ‌నం కోసం 10 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు ఈవో. వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాలు పూర్త‌య్యాయ‌ని, ఆరున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా భ‌క్తులకు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు శ్యామ‌ల రావు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments