Thursday, April 17, 2025
HomeDEVOTIONALతిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.21 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వులతో కిట కిట లాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.

శ్రీ‌వారిని ఫిబ్ర‌వ‌రి 4న మంగ‌ళ‌వారం 73 వేల 599 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 16 వేల 69 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.21 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు.

ప్ర‌స్తుతం స్వామి, అమ్మ వార్ల ద‌ర్శ‌నం కోసం డైరెక్టు లైన్ కొన‌సాగుతోంద‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు స‌ర్వ ద‌ర్శ‌నం కోసం 6 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు ఈవో. ఇదిలా ఉండ‌గా ర‌థ స‌ప్త‌మి సంద‌ర్బంగా స్వామి వారు మాడ వీధుల్లో ఏడు వాహ‌నాల‌లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments