Wednesday, April 2, 2025
HomeDEVOTIONALశ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.65 కోట్లు

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.65 కోట్లు

ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య 62 వేల 263

తిరుమ‌ల – తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. గోవిందా గోవిందా శ్రీ‌నివాస గోవిందా అంటూ నామ స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా భావిస్తున్నారు.

సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్న‌ట్ల‌యితే త‌మ‌కు తెలియ చేయాల‌ని ఈవో జె. శ్యామ‌ల రావు భ‌క్తుల‌కు విన్న‌వించారు. స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపారు.

మార్చి 30న ఆదివారం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 62 వేల 263 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 25 వేల 733 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3. 65 కోట్లు వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు ఏవో శ్యామ‌ల రావు. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌స్తుతం 31 కంపార్టుమెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 18 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments