Wednesday, April 9, 2025
HomeDEVOTIONALతిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త జనం

తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త జనం

శ్రీ‌వారి వారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వులతో కిట కిట లాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.

శ్రీ‌వారిని ఫిబ్ర‌వ‌రి 9న ఆదివారం 84 వేల 536 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 25 వేల 890 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు.

ప్ర‌స్తుతం స్వామి, అమ్మ వార్ల ద‌ర్శ‌నం కోసం 27 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి వున్న భ‌క్తుల‌కు క‌నీసం 15 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ఈనెల 4న నిర్వ‌హించిన ర‌థ‌స‌ప్త‌మి ఘ‌నంగా జ‌రిగింద‌ని, స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు ఈవో.

RELATED ARTICLES

Most Popular

Recent Comments