దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,298
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుండడంతో ఎక్కడ చూసినా భక్త జన సందోహమే కనిపిస్తోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు టీటీడీ ఈవో జే శ్యామల రావు.
డిసెంబర్ 30న సోమారం భక్తులు భారీగా తరలి వచ్చారు తిరుమలకు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 68 వేల 298 మంది భక్తులు దర్శించుకున్నారు. 16 వేల 544 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు.
భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 4.10 కోట్లు వచ్చినట్లు టీటీడీ కార్య నిర్వహణ అధికారి జె. శ్యామలా రావు వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని , సర్వ దర్శనం కోసం ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 6 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.