Thursday, April 17, 2025
HomeDEVOTIONALతిరుమ‌ల‌లో గోకులాష్ట‌మి..ఉట్లోత్స‌వం

తిరుమ‌ల‌లో గోకులాష్ట‌మి..ఉట్లోత్స‌వం

ఆగ‌స్టు 27, 28న నిర్వ‌హిస్తామ‌న్న టీటీడీ

తిరుమల : తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సాక్షాత్తు ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వ భూపాల వాహనంపై శ్రీ కృష్ణ స్వామి వారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు.

శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మ వార్లకు, శ్రీ కృష్ణ స్వామి వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశ ఆరాధనం చేపడతారు.

ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరుచ్చిపై, శ్రీ కృష్ణ స్వామి వారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామి వార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments