Saturday, May 24, 2025
HomeDEVOTIONALముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు

ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు

అంద‌జేసిన టీటీడీ చైర్మ‌న్..ఈవో శ్యామ‌ల రావు

తిరుమ‌ల -శ్రీ విశ్వవాసు నామ తెలుగు ఉగాది సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబుకు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి ఈఓ జె. శ్యామలారావు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చైర్మన్, ఈఓ ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా, ఛైర్మన్ మరియు ఈఓ శేష వస్త్రం మరియు శ్రీవారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందించారు.

అంతకు ముందు, టిటిడి ట్రస్ట్ బోర్డు చీఫ్ , ఈఓ ఇద్దరూ కూడా ఏప్రిల్ 05-15 వరకు కడప జిల్లాలో జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతా రామ కళ్యాణం రాష్ట్ర ఉత్సవానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ప‌త్రిక‌ను అందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments